చిన్నారి భూమికకు అండగా నిలిచిన ఇంజినీరింగ్ అసిస్టెంట్లు

AP: తిరుపతి జిల్లా పాకాల మండలానికి చెందిన భూమికకు ప్రాణదాతలుగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ముందుకొచ్చారు. సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా పని చేస్తున్న మోహన్ రాజు కుమార్తె భూమిక తలసేమియాతో బాధపడుతోంది. తన చికిత్స కోసం రూ.50 లక్షలు అవసరమని తెలుసుకున్న Association of Secretariat Engineers(ASE), Association of Engineering Assistants, Andhra Pradesh సభ్యులు మొత్తం రూ.15 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు.



