స్కీమ్ వర్కర్ల దీక్షలు.. నిరంకుశత్వానికి నిరసన!

ఖమ్మం జిల్లాలో స్కీమ్ వర్కర్ల ఆందోళన కొనసాగుతోంది. హైదరాబాద్లో నిరసనలను పోలీసులు అరెస్టులతో అడ్డుకున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదని సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కళ్యాణం వెంకటేశ్వరరావు, తుమ్మా విష్ణువర్ధన్ అన్నారు. నిరసనగా ఖమ్మం నూతన కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సామూహిక దీక్షలు చేపట్టారు. తెలంగాణ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్ దీక్షలను ప్రారంభించారు. హామీల అమలుకు ఈ నెల 18 తర్వాత మరిన్ని పోరాటాలు చేపడతామని నాయకులు తెలిపారు.



