Gen Z..ప్రపంచ రాజకీయాలను మార్చే శక్తి :మాజీ ఎమ్మెల్సీ

AP: నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలతోపాటు తమిళనాడులో ప్రభుత్వాల మార్పులోనూ Gen Z కీలకపాత్ర పోషించిందని మాజీ ఎమ్మెల్సీ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్.లక్ష్మణరావు అన్నారు. గుంటూరు నగరం బ్రాడీపేటలో జరిగిన ‘Gen Z ఉద్యమంపై విశ్లేషణ’ చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. 1997–2012 మధ్య జన్మించిన యువతను Gen Z గా పిలుస్తారని తెలిపారు. స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, వేగంగా ఫలితాల కోసం పోరాడటం వారి ప్రత్యేకత అన్నారు. భవిష్యత్తులో ప్రపంచ రాజకీయాలను మార్చగల శక్తి యువతకే ఉందని పేర్కొన్నారు.



