మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

అమెరికా ట్రెజరీ బాండ్ దిగుబడులు తగ్గడం, డాలర్ బలహీనపడటంతో గోల్డ్ రేట్లు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.880 పెరిగి రూ.1,63,970 కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ గోల్డ్ రేట్ రూ.800 పెరిగి రూ.1,50,300 గా నమోదైంది. పసిడి ప్రియులు గోల్డ్ షాపింగ్ చేసేముందు లైవ్ రేట్లను ఒక్కసారి చెక్ చేసుకోవడం బెటర్.


