అంకితభావంతో సేవ చేస్తారని..నిందితులను వదిలేసిన కోర్టు

2013 ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్ అల్లర్లకు సంబంధించిన కేసులో 10 మంది బీజేపీ నాయకులు, సమాజ్వాదీ పార్టీ ఎంపీకి ప్రత్యేక కోర్టు రిలీఫ్ ఇచ్చింది. రాష్ట్ర మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్, ఎమ్మెల్సీ అశోక్ కటారియా, సమాజ్వాదీ పార్టీ ఎంపీ హరేంద్ర మాలిక్, మరికొందరు నేతలకు కేసు వావస్ తీసుకునేందుకు అనుమతిచ్చింది. కేసులో నిందితులుగా మాజీ బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, విశ్వహిందూ పరిషత్ నాయకురాలు సాధ్వి ప్రాచి ఉన్నారు. కేసు ఉపసంహరించుకుంటే నిందితులు అంకితభావంతో ప్రజాసేవ చేయగలుతారు అని కోర్టు తెలిపింది.


