త్రిపుర డీజీపీ అనుమానాస్పద మృతి

త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. అగర్తలా పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని ఆఫీస్ బాత్రూంలో స్పృహ లేకుండా పడి ఉన్న ఆయనను హాస్పిటల్కు తరలించారు. డాక్టర్స్ ఆయనను పరిశీలించి అప్పటికే మరణించినట్లు తెలిపారు. ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. దీనిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. అనురాగ్ ధన్ఖడ్ 1994 బ్యాచ్కు చెందిన త్రిపుర క్యాడెర్ ఐపీఎస్ అధికారి.



