← Back to news

లారీ డ్రైవర్‌పై దాడి.. ధర్నాకు లారీ అసోసియేషన్!

By Mahesh· 24 Aug 2026· విశాఖపట్నం

AP: విశాఖపట్నంలోని గాజువాకలో లారీ డ్రైవర్‌పై ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ డ్రైవర్ దాడి చేసిన ఘటన కలకలం రేపింది. షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ ఆపలేదని బ్రేక్ ఇన్‌స్పెక్టర్ పార్వతి వెహికల్‌ను ఓవర్‌టేక్ చేసినట్లు తెలుస్తోంది. తరువాత ఇన్‌స్పెక్టర్ దగ్గరే ఆమె డ్రైవర్ లారీ డ్రైవర్‌పై పిడిగుద్దులతో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. దీంతో దారుణంగా దాడి చేశారంటూ ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

More in AP