← Back to news

గురుకులంలో నీటి కష్టాలు

By DK· 16 Jul 2026

TG: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్‌లోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు నీటి సమస్య తీర్చాలంటూ ధర్నా చేశారు. గత నెల రోజులుగా నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం బాత్రూంలో శుభ్రం చేయడానికి కూడా నీరు లేక గురుకుల పాఠశాల సిబ్బంది తమను ఇబ్బంది పెడుతున్నారన్నారు. పది పది రూపాయలు చెల్లిస్తేనే రిపేర్ చేపిస్తామని HM చెప్పినట్లు వారు వాపోయారు. వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు.

More in Education