డాక్టర్ నంబర్ కోసం వెతికితే.. డబ్బు మాయం

TG: హైదరాబాద్లోని నాగోల్ వాణీనగర్కు చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి శెట్టి వేణుగోపాల్ కిమ్స్ ఆస్పత్రి డాక్టర్ అపాయింట్మెంట్ కోసం ఆన్లైన్లో ఫోన్ నంబర్ వెతికారు. నకిలీ నంబర్కు కాల్ చేయగా, సైబర్ మోసగాళ్లు రూ.5 చెల్లించాలని చెప్పి వాట్సాప్లో APK ఫైల్ పంపించారు. దానిని ఇన్స్టాల్ చేయగానే మొబైల్ స్తంభించిపోయి, బ్యాంకు ఖాతా నుంచి రూ.1.96 లక్షలు కాజేశారు. బాధితుడు మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.



