నీట్లో తెలంగాణ స్టూడెంట్కు 13వ ర్యాంకు

TG: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ గురువారం రాత్రి విడుదలయ్యాయి. మొత్తం 5,440 పరీక్షల కేంద్రాల ద్వారా దాదాపు 20 లక్షల మంది స్టూడెంట్స్ ఈ పరీక్షకు హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 65,087 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారని ఎన్టీఏ ప్రకటించింది. వీరిలో తెలంగాణలోని హనుమకొండకు చెందిన వీరయ్యగారి సహ్యు 720కి గానూ 705 మార్కులుతో ఆలిండియాలో 13వ ర్యాంకు సాధించాడని ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఏ.వరదారెడ్డి తెలిపారు.



