హైదరాబాద్ లో పేషెంట్... చైనా నుంచి రోబో ఆపరేషన్ !

చైనాలోని వూహాన్లో ఉన్న భారతీయ యూరాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ మహమ్మద్ గౌస్, 3,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్లోని ఒక రోగికి రోబో సహాయంతో విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. చైనా అభివృద్ధి చేసిన రోబోటిక్ టెక్నాలజీ, అత్యంత వేగవంతమైన 5G ఇంటర్నెట్ సహాయంతో ఈ బ్లాడర్ రీకనెక్షన్ సర్జరీ సాధ్యమైంది. ఆసుపత్రి, హైదరాబాద్ వైద్య బృందం సమన్వయంతో సుమారు 90 నిమిషాల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. వైద్యరంగంలో సరిహద్దులు దాటి సాధించిన ఈ చారిత్రాత్మక మైలురాయిని భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యు జింగ్ ఎక్స్ (X) ద్వారా కొనియాడారు. సాంకేతికత ప్రాణాలను రక్షించడంలో ఎలా ఉపయోగపడుతుందో ఈ ఘటన నిరూపించింది



