కొండగట్టు దగ్గర ఘోర ప్రమాదం.. 20 మందికి తీవ్ర గాయాలు!
జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి, అందులో 5 మంది పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ఇక లారీ డ్రైవర్ క్యాబిన్లోనే చిక్కుకుపోగా, లోకల్స్ చాలా కష్టపడి బయటకు తీశారు. గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని హాస్పిటల్కి తరలించారు.



