← Back to news

గాయపడిన విద్యార్థినిపై ప్రియాంక గాంధీ లోక్‌సభలో ప్రస్తావన

By Mahesh· 28 Jul 2026
గాయపడిన విద్యార్థినిపై ప్రియాంక గాంధీ లోక్‌సభలో ప్రస్తావన

పోలీసుల లాఠీచార్జిలో గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్న దిల్లీ విద్యార్థిని అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ లోక్‌సభలో ప్రస్తావించారు. ఇటీవల రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌కు వెళ్లి విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నామని ఆమె తెలిపారు. రాజకీయ నాయకులు తన కుమార్తెను పదేపదే సందర్శిస్తుండటం వల్ల విద్యార్థిని తల్లి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ప్రియాంక గాంధీ సభలో అన్నారు. 'దీనిపై అమిత్‌ షా సమాధానం చెప్పాలి. పేపర్ లీక్ చేసి పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారు’ అని లోక్‌సభలో మండిపడ్డారు.

More in Politics