నది దాటుతూ స్కూల్కు.. సోషల్ మీడియాలో వైరల్
మధ్యప్రదేశ్లోని విదిశా జిల్లాలో స్కూల్కు వెళ్లేందుకు పిల్లలు బేత్వా నదిపై డ్యామ్ను దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విద్యార్థులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రతిరోజూ ఈ దారిలోనే వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, విచారణలో ఈ వీడియో విదిశా జిల్లా పలోహ్ గ్రామంలోనిదిగా అధికారులు గుర్తించారు. పలోహ్హై స్కూల్కు వెళ్లేందుకు ఈ దారిని ఉపయోగిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు సైకిళ్లు అందించడంతో పాటు వంతెన నిర్మిస్తామని జిల్లా అధికారులు హామీ ఇచ్చారు.



