ఉద్యోగాల కోసం గడ్డి, మట్టి తింటూ ఆందోళన!

కేరళలో టీచర్ ఎగ్జామ్స్ పాసైన క్యాండిడేట్స్ చేస్తున్న నిరసన పెద్దదిగా మారింది. పీఎస్సీ ఎగ్జామ్లో సెలెక్ట్ అయినా జాబ్స్ ఇవ్వడం లేదని లోయర్ ప్రైమరీ స్కూల్ టీచర్ ర్యాంకర్లు 35 రోజులుగా సెక్రటేరియట్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్నారు. గడ్డి, మట్టి తింటూ వినూత్నంగా తమ నిరసన తెలిపారు. వెంటనే అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలని, ర్యాంక్ లిస్ట్ టైమ్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు ఆరు రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు.



