తెలంగాణకు మరో గర్వకారణం.. ‘గొల్లల గుడి’కి గుర్తింపు!
TG: ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న ‘గొల్లల గుడి’కి కేంద్ర ప్రభుత్వం కీలక గుర్తింపు ఇచ్చింది. ఈ హిస్టారిక్ ప్లేస్ను నేషనల్ హెరిటేజ్ సైట్గా గుర్తిస్తూ ఆఫిషియల్ అనౌన్స్మెంట్ చేసింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ పరిధిలోని ASI ఆగస్ట్ 31న ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ‘గెజిట్ ఆఫ్ ఇండియా’లోనూ దీనిని పబ్లిష్ చేసింది. దీంతో గొల్లల గుడి సంరక్షణ, పరిరక్షణకు మరింత ఇంపార్టెన్స్ పెరగనుంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ‘కాకతీయ రుద్రేశ్వర’ (రామప్ప) ఆలయానికి సౌత్వెస్ట్ సైడ్లో ఈ ‘గొల్లల గుడి’ ఉంటుంది.



