రీసర్వేతో భూరికార్డుల ప్రక్షాళన: చంద్రబాబు

AP: సుపరిపాలన అందిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతినెలా సమావేశాలు నిర్వహిస్తున్నామని CM చంద్రబాబు స్పష్టం చేశారు. గత పాలనలో అస్తవ్యస్తంగా మారిన భూరికార్డులను ప్రక్షాళన చేసేందుకు రెవెన్యూ సంస్కరణలు చేపట్టామని చెప్పారు. ఏలూరు జిల్లా కలిదిండిలో ఆయన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. 2027 నాటికి రీసర్వే పూర్తి చేసి రైతులు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తామని హామీ ఇచ్చారు.



