← Back to news

పార్లమెంట్ సెషన్స్ పై ఆల్ పార్టీ మీట్ కు టీఎంసీ రెబెల్స్ !

By DS· 19 Jul 2026· ndtv· Delhi
పార్లమెంట్ సెషన్స్ పై ఆల్ పార్టీ మీట్ కు టీఎంసీ రెబెల్స్ !

పార్లమెంట్ సమావేశాల కోసం కేంద్రం నిర్వహించిన ఆల్ పార్టీ మీట్లో గందరగోళం నెలకొంది. 20 మంది TMC తిరుగుబాటు ఎంపీలతో కూడిన 'నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా' (NCPI) ను ఈ సమావేశానికి ఆహ్వానించడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. స్పీకర్ నిర్ణయం తీసుకోక ముందే వాళ్లను ఎలా ప్రత్యేక పార్టీ కింద పిలుస్తారని ప్రశ్నిస్తూ విపక్ష ఎంపీలు సమావేశం వాకౌట్ చేశారు. అందరినీ పిలవడం తమ బాధ్యత అందుకే పిలిచాం అని కేంద్రమంత్రి కిరిణ్ రిజిజు వివరణ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికి విపక్ష ఎంపీలు తిరిగి చర్చల్లో పాల్గొన్నారు.

More in News