నారాయణగూడ సర్వే భవన్ వద్ద ఉద్రిక్తత
TG: హైదరాబాద్లోని నారాయణగూడ సర్వే భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ రెవెన్యూ లైసెన్స్డ్ సర్వేయర్లు కార్యాలయాన్ని ముట్టడించారు. సర్వేయర్లు లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులతో తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. సీఎం చేతుల మీదుగా లైసెన్స్ పత్రాలు అందించి ఏడాది గడుస్తున్నా, ఇప్పటివరకు తమను విధుల్లోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విధుల్లోకి చేర్చుకుని, నెలకు ₹30,000 జీతంతో ఉద్యోగ భద్రత కల్పించాలని సర్వేయర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు



