← Back to news

నీళ్లు తాగిన స్టూడెంట్స్‌కు అస్వస్థత.. స్కూల్‌లో టెన్షన్

By DK· 2 Aug 2026· అన్నమయ్య జిల్లా
నీళ్లు తాగిన స్టూడెంట్స్‌కు అస్వస్థత.. స్కూల్‌లో టెన్షన్

AP: అన్నమయ్య జిల్లా KV పల్లి మండలం చిన్నకంపల్లి ప్రభుత్వ పాఠశాలలో తాగునీరు తాగిన అనంతరం ముగ్గురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కలకలం రేపింది. వాంతులు, అనారోగ్య లక్షణాలు కనిపించడంతో ఉపాధ్యాయులు వెంటనే వారిని మహల్ క్రాస్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు. తాగునీటిలో గుర్తుతెలియని విషపదార్థం కలిసిందనే అనుమానంతో పోలీసులు పాఠశాలకు చేరుకుని విచారణ ప్రారంభించారు. నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపేందుకు చర్యలు చేపట్టారు.

More in Education