జాతీయ పక్షికి అరుదైన గౌరవంతో వీడ్కోలు
ఢిల్లీ నరేలా పార్కులో కుక్కల దాడిలో మరణించిన జాతీయ పక్షి నెమలికి పోలీసులు అరుదైన గౌరవం కల్పించారు. ఎస్ఐ సురేంద్ర మాలిక్ బృందం నెమలి కళేబరాన్ని జాతీయ జెండాతో చుట్టారు. స్థానికుల సాయంతో పార్కులోనే నెమలికి అంత్యక్రియలు నిర్వహించారు. రాత్రి విధుల్లో ఉంటూనే మూగజీవి పట్ల పోలీసులు చూపిన మానవత్వానికి సంబంధించిన వీడియో నెట్లో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.



