🌍 ప్రపంచ వేదికపై విజయవాడ విద్యార్థి..

విజయవాడ విద్యార్థి అంతర్జాతీయ వేదికపై అదరగొట్టాడు! బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన ఇంటర్ విద్యార్థి నరేన్ తుమ్మల.. యూకేలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జరిగిన అంతర్జాతీయ సింపోజియంలో భారత్ నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థిగా క్వాంటమ్ కంప్యూటింగ్పై తన రీసెర్చ్ను ప్రెజెంట్ చేశాడు. భవిష్యత్ క్వాంటమ్ కంప్యూటర్లలో వచ్చే ఎరర్లను ఎలా తగ్గించొచ్చో వివరించి అందరి ప్రశంసలు అందుకున్నాడు.



