విద్యార్థులపై కాల్పులకు అమిత్ షానే కారణం: రాహుల్ గాంధీ

లోక్సభలో రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్తో ఒక్కసారిగా హీట్ పెరిగింది. NEET నిరసనల సమయంలో విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించడానికి అమిత్ షానే ఆదేశించారని ఆయన అన్నారు. అంతేకాదు, "అమిత్ షా భయపడుతున్నారు అందుకే సభకు రావడం లేదు" అని కూడా చెప్పారు.దీంతో BJP సభ్యులు "ఆధారాలేంటి?" అంటూ నిలదీశారు. కిరణ్ రిజిజు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయగా.. స్పీకర్ ఓం బిర్లా రాహుల్ చేసిన కొన్ని కామెంట్స్ను 'అన్పార్లమెంటరీ'గా పేర్కొంటూ రికార్డుల నుంచి తొలగించారు.


