AI మనుషుల్ని మింగేస్తుంది : మస్క్ వార్నింగ్

AI వల్ల మనుషులకే డేంజర్ ఉందంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ బాంబు పేల్చారు. కాలిఫోర్నియా కోర్టులో OpenAIకి వ్యతిరేకంగా పోరాడుతున్న మస్క్ ఈ కేసు విచారణ సందర్భంగా తన అభిప్రాయాలు చెప్పారు. మనకి కావల్సింది టెర్మినేటర్ మూవీలాంటి టెక్నాలజీ కాదన్నారు. AIని కంట్రోల్ చేయకపోతే అది మనల్నే హతం చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఏఐ కంపెనీలు లాభాల కోసం సేఫ్టీని వదిలేస్తే ఈ 'డిజిటల్ దేవుడు' మనుషులకే ముప్పుగా మారుతాడని మస్క్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



