ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు
ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపంలో ఈరోజు ఉదయం భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై 7.7 తీవ్రత నమోదైనట్లు US జియోలాజికల్ సర్వే తెలిపింది. దాదాపు గంటన్నరలో ఐదుసార్లు ఎర్త్క్వేక్ ట్రెమర్స్ వచ్చాయి. దీంతో ఈస్ట్ నుసా తెంగారా ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఎండే నగరానికి 68 కి.మీ దూరంలో 10 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తీర, నదీ దగ్గర ప్రాంతాల ప్రజలు అలెర్ట్గా ఉండాలని అధికారులు సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టంపై ఇంకా వివరాలు ప్రకటించలేదు.


