కనీస రోడ్లు,సదుపాయాలు లేక స్థానిక ప్రజలు నరకయాతన

AP: తిరుపతి జిల్లా సత్యవేడు మండలం వెంకటరాజులకండ్రిగలో మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిమెంట్ రోడ్లు లేక వర్షాలకు రహదారులు బురదమయమవుతున్నాయని, రోడ్లు ఇరుకుగా ఉండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. అటవీ ప్రాంతం కావడంతో పాములు సంచరిస్తున్నా వీధి దీపాలు సక్ర మంగా వెలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


