ప్రిన్సిపాల్ అవమానించిందని..దళిత అమ్మాయి ఆత్మహత్య

ప్రిన్సిపాల్ అవమానించిందని తమిళనాడు రాష్ట్రం మదురై జిల్లా ఉసిలంపట్టికి చెందిన దళిత అమ్మాయి(16) ఆత్మహత్య చేసుకుంది. నర్సింగ్ చదవాలనుకున్న ఆ అమ్మాయి అడ్మిషన్ కోసం ప్రభుత్వ మోడల్ సెకండరీ స్కూల్కి తన తల్లితో కలిసి వచ్చింది. ఇంటర్వ్యూ టైంలో తన తల్లి చేతులు ముడుచుకుని నిలబడి ఉండటం చూసి, చేతులు సరిచేసుకోమని అమ్మాయి తల్లికి సైగ చేసింది. ప్రిన్సిపల్ కోపం తెచ్చుకుని, ఆ అమ్మాయిపై కుల వివక్ష కామెంట్స్ చేసింది. మనస్తాపం చెందిన అమ్మాయి ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. ప్రిన్సిపల్పై కేసు రిజిస్టర్ చేశారు.



