పీఎం, హోంమంత్రి..ఇద్దరూ పార్లమెంట్కు రాలేదు: రాహుల్

ఢిల్లీలో సీజేపీ నిరసనకారులు, విద్యార్థులపై పోలీసులు జరిపిన కాల్పులకు హోంమంత్రి అమిత్షా బాధ్యత తీసుకుంటారా అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇవాళ పీఎం కానీ, హోంమంత్రి కానీ పార్లమెంట్కు రాలేదన్నారు. దీని మీద హోంమంత్రి ఇచ్చే సమాధానం కన్నా, ఆయన ఆదేశాలతోనే పెలెట్ గన్స్ వాడారన్న విషయం తెలియడం ముఖ్యమని అన్నారు. అలా ఆదేశాలివ్వడం వెనుక ఆయన ఉద్దేశమేంటో తెలియాలన్నారు.



