ఇకపై రైలు ప్రయాణికులను అలా పిలవొద్దు- సుప్రీం !

ఇకపై రైల్వే ప్రయాణికులను సెకండ్ క్లాస్ ప్రయాణికులు అని సంబోధించవద్దని రైల్వే శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది..అలా పిలవడం రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమని కామెంట్ చేసింది.'క్లాస్'అనే డివిజన్ కేవలం రైలు కోచ్లకు మాత్రమే లిమిట్ చేయాలని ద్విసభ్య బెంచ్ స్పష్టం చేసింది. యాక్సిడెంట్లు జరిగినప్పుడు టికెట్ పోయినా పరిహారాన్ని నిరాకరించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. బాధిత కుటుంబాలు అఫిడవిట్ ఇస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. రైల్వేయాక్సిడెంట్ బీమా చట్టాలను మానవతా దృక్పథంతో అమలు చేయాలని బెంచ్ కోరింది.



