← Back to news

కానిస్టేబుల్‌పై అటాక్.. ఇద్దరు యువకులు అరెస్ట్

By dk· 13 Aug 2026· తిరుపతి జిల్లా

AP: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆగస్టు 11న రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రమణయ్యతో ఇద్దరు యువకులు వాగ్వాదానికి దిగారు. వారిలో అచ్చి శ్రీనివాసులు<a href="https://www.theclearcutnews.com/n/bgHVjsn"> కత్తితో</a> దాడికి యత్నించగా, అప్రమత్తమైన రమణయ్య తృటిలో తప్పించుకున్నారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అచ్చి శ్రీనివాసులు (22), బీటెక్ విద్యార్థి సముద్రాల జితేంద్ర కుమార్ (20)ను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు శ్రీనివాసులును పట్టణ వీధుల్లో నడిపించుకుంటూ తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు.

More in AP