CJIని రావొద్దంటూ లా స్టూడెంట్స్ షాకింగ్ డెసిషన్!

హైదరాబాద్ నల్సార్ లా యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ డేకి CJI సూర్య కాంత్ను చీఫ్ గెస్ట్గా పిలవవద్దంటూ 450 మంది స్టూడెంట్స్ విసికి లేఖ రాశారు. ఇటీవల నీట్ ప్రొటెస్ట్లో పోలీస్ దాడులపై పిటిషన్ విచారిస్తూ "వీడియోలు చూపిస్తూ మా టైమ్ వేస్ట్ చేయకండి" అని CJI చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. విద్యార్థుల హక్కులను పట్టించుకోని వారి చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోలేమని చెప్పారు. వివాదం నేపథ్యంలో ఈసారి అసలు గ్రాడ్యుయేషన్ డే ఈవెంట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది.



