బాబోయ్.. వాటర్ ట్యాంకులో పాముల కుప్ప
ఉత్తరాఖండ్ హరిద్వార్లోని ఓ ఇంట్లో వాటర్ ట్యాంక్లోకి నీళ్లు వెళ్లడం లేదు. యజమానులు అండర్గ్రౌండ్లోని ట్యాంక్ మూత తీసి చూశారు. షాక్..! ఏకంగా 27 పాములు ఒకదానిపై ఒకటి మెలికలు తిరుగుతూ కనిపించాయి. భయంతో వణికిపోయిన ఆ కుటుంబం అటవీ శాఖ సిబ్బందిని పిలిచింది. వాళ్లు వచ్చి ట్యాంకులోని పాములన్నింటినీ బయటకు తీసి అడవిలో వదిలేశారు.



