గ్రామస్తులను టెన్షన్ పెట్టిన మందు బాబు!

ఉత్తరప్రదేశ్ మహారాజ్గంజ్ జిల్లా పర్సాఖుర్ధా గ్రామంలో ఒక రేంజ్ హై-డ్రామా జరిగింది. దీనదయాళ్ అనే వ్యక్తి ఫుల్గా తాగేసి, ఏకంగా 11,000 వోల్టుల కరెంట్ స్తంభం ఎక్కి వైర్లపై ఉయ్యాల ఊగాడు. దీంతో టెన్షన్ పడ్డ గ్రామస్తులు బీతౌలి పోలీసులకు, విద్యుత్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పవర్ సప్లై ఆపించారు. గంటల కొద్దీ కష్టపడి అతన్ని కిందకి దించారు. షాకింగ్ ఏంటంటే.. అతను స్తంభం ఎక్కడానికి జస్ట్ కొన్ని నిమిషాల ముందే పవర్ కట్ అవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.



