బెంగళూరు డాక్టర్పై కేసు నిలిపేసిన హైకోర్టు

బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన ఒక జంటను వేధించాడని బెంగళూరుకు చెందిన 'డాక్టర్ నాగేంద్రపై' పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణను కర్ణాటక హైకోర్టు ఆపేసింది. అసలు నిజనిజాలు తెలుసుకోకుండా పోలీసులు తొందరపడి కేసు ఎలా రాశారని కోర్టు తప్పుబట్టింది. ఒక పౌరుడు అక్రమంగా ఉంటున్న వాళ్లను గుర్తిస్తుంటే, తిరిగి అతనిపైనే కేసు పెట్టడం సరికాదని జడ్జ్ చెప్పారు. నగరంలో అక్రమంగా ఉంటున్న వాళ్లను పట్టుకుని ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. విచారణను ఆగస్టు 6కు వాయిదా వేశారు.



