పేపర్ లీక్లకు శాశ్వత పరిష్కారం కావాలి

TG: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై TRS చీఫ్ కల్వకుంట్ల కవిత స్పందించారు. మంత్రి రాజీనామా ఒక్కటే పరిష్కారం కాదని ఆమె స్పష్టంచేశారు. పేపర్ లీకేజీలకు శాశ్వత ముగింపు పలకాలంటే విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు నిజమైన న్యాయం జరగాలంటే మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పారదర్శకమైన పరీక్షల నిర్వహణకు కఠిన చర్యలు, బలమైన సంస్కరణలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆమె కోరారు.



