DSCపై శాసనమండలిలో YSRCP నిరసనలు

AP: శాసనమండలి రెండో రోజు సమావేశాలు DSC అంశంపై వాడీవేడిగా సాగాయి. DSCపై YSRCP సభ్యులిచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు రిజెక్ట్ చేశారు. MLCలు నినాదాలు చేస్తూ పోడియం వద్ద నిరసనకు దిగారు. బల్లలు చరుస్తూ ఆందోళన చేశారు. DSCపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల తర్వాత BACకి పిలుస్తామని చైర్మన్ చెప్పినా, వెంటనే చర్చ చేపట్టాలని బొత్స సత్యనారాయణ పట్టుబట్టారు. దీంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు.



