ఫస్ట్ రోజే నీటి కష్టాలు.. విద్యార్థుల అవస్థలు

TG: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని విశ్వనాథపల్లి ప్రాథమిక పాఠశాలలో మౌలిక సదుపాయాల కొరత యథాతథంగా కొనసాగుతోంది. ముఖ్యంగా తాగునీటి సమస్య, అపరిశుభ్రమైన మరుగుదొడ్లు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గతసంవత్సరంలో 28మంది స్టూడెంట్స్ ఉన్న ఈ స్కూల్లో ప్రస్తుత విద్యాసంవత్సరం తొలిరోజు కేవలం 23మంది మాత్రమే హాజరైనట్లు ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాలలో నెలకొన్న సమస్యల కారణంగానే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.



