కాసుల కోసం ప్రాణాలతో చెలగాటం

TG: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లో నిబంధనలకు విరుద్ధంగా ఆటోలో ఏకంగా 22 మంది ప్రయాణికులను ఎక్కించుకున్న డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. మన్నూరు-శాంతాపూర్ రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దాసరి మధుకర్ అనే ఆటోడ్రైవర్ పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని ప్రమాదకరంగా తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే ఆటోను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. డ్రైవర్పై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు గుడిహత్నూర్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.



