కోట్లు కాజేసిన ఘరానా మోసగాడు అరెస్ట్

AP: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే నెలకు 10 నుంచి 20 శాతం లాభాలు వస్తాయని ఆశ చూపి రూ.15 కోట్లు మోసం చేసిన అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడిని కడప రిమ్స్ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలోని భద్రాచలం పట్టణానికి చెందిన కిచ్చా వీరభద్రరావు అలియాస్ కేవీ రావు హైదరాబాద్ కేంద్రంగా నకిలీ ట్రేడింగ్ సంస్థలు నడుపుతూ AP, తెలంగాణ, హర్యానా రాష్ట్రాల్లో పలువురిని మోసం చేసినట్లు తెలిపారు. కడపకు చెందిన ఇద్దరు మహిళలను రూ.55 లక్షల నమ్మించి మోసం చేసిన కేసులో అతడిని పట్టుకున్నారు. నిందితుడిపై మూడు రాష్ట్రాల్లో కేసులు నమోదైనట్లు వెల్లడించారు.



