హిస్టరీలో మొదటిసారి.. సుప్రీంకోర్టు దగ్గర ఏం జరిగిందంటే?
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న స్టూడెంట్స్ ప్రొటెస్ట్కి మద్దతుగా సుప్రీంకోర్టు లాయర్లు రంగంలోకి దిగారు. నిరసనకారులపై పోలీసుల చర్యలను నిరసిస్తూ సుప్రీంకోర్టు ఆవరణలో రాజ్యాంగ పీఠిక (Preamble) చదివారు. అనంతరం జాతీయ గీతం పాడి తమ నిరసన తెలిపారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసమే ఈ నిరసన అని, విద్యార్థులకు న్యాయం జరగాలంటూ లాయర్లు గళమెత్తారు.



