పరుగు పందెంలో భారత్కు రెండు పతకాలు

మెన్ 100 మీటర్ల పరుగు పందెంలో మన ఇండియన్ పారా అథ్లెట్స్ దిలీప్ మహాదు గవిత్, మహమ్మద్ బాసిల్ మొదటి రెండు స్థానాల్లో నిలిచి గోల్డ్, సిల్వర్ మెడల్స్ గెలిచారు. గవిత్ 10.71 సెకన్లలో రేసు పూర్తి చేసి ఫస్ట్ ప్లేస్లో నిలవగా, బాసిల్ 10.83 సెకన్లతో సెకండ్ ప్లేస్ లో వచ్చాడు. ఈ గోల్డ్తో భారత్కు మూడు బంగారు పతకాలు వచ్చాయి. అంతకుముందు మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్లో, షర్మిలా ధనకర్ షాట్పుట్లో గోల్డ్ మెడల్స్ గెలిచారు.



