విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ ముట్టడి.. ఉద్రిక్తత

TG: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని లక్డీకపూల్లో విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ను SFI నాయకులు ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా వచ్చి ఆఫీస్ వద్ద బైఠాయించారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, రాష్ట్రంలో 27,000 పాఠశాలలను 4000 పాఠశాలలకు కుదించాలనే ఆలోచనను మానుకోవాలని డిమాండ్ చేశారు.



