అదానీ గ్రూప్ ప్రాజెక్టులకు 83,700 చదరపు అడుగుల అటవీ భూమి

అదానీ గ్రూప్కు చెందిన రెండు కంపెనీల ప్రాజెక్టుల కోసం దాదాపు 83,700 చదరపు అడుగుల అటవీ భూమిని మళ్లించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇందులో రాయ్గడ్ జిల్లాలోని రిజర్వ్ ఫారెస్ట్, మాంగ్రోవ్ భూమి, అమరావతి జిల్లాలోని అటవీ భూమి ఉన్నాయి. అటవీ అధికారులకు ఆ భూమిలో అడ్డంకి లేకుండా ఎంట్రీ ఉంటుందన్న కండీషన్తో పర్మిషన్ ఇచ్చారు. అలా చేయకపోతే ఈ పర్మిషన్ను వెంటనే విత్డ్రా చేసుకుంటారు.



