గాజా చిన్నారి కేసులో ట్విస్ట్.. తప్పు ఒప్పుకున్న ఆర్మీ!

గాజాలో 2024లో ఐదేళ్ల పాలస్తీనా బాలిక హింద్ రజబ్తో పాటు కుటుంబం ఉన్న కారుపై తామే ఫైరింగ్ జరిపినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ మొదటిసారి అధికారికంగా ఒప్పుకుంది. దాడి నుంచి బతికిన హింద్ రక్షణ కోసం రెడ్ క్రెసెంట్కు ఫోన్ చేసి వేడుకున్న ఆడియో రికార్డింగ్ గ్లోబల్గా వైరల్ అయింది. ఈ ఘటనతో పాటు ఆమెను రక్షించేందుకు వెళ్లిన అంబులెన్స్పై జరిగిన అటాక్పై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్కు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఆర్డర్స్ ఇచ్చింది. ఈ కన్నీటి కథ ఆధారంగా వచ్చిన ‘ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్’ మూవీ ఆస్కార్ రేసులో నిలిచింది.



