భిన్నత్వంలో ఏకత్వానికి జెండా గుర్తు

1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం రాకముందే, అంటే 1947 జూలై 22న జరిగిన రాజ్యాంగ పరిషత్ సమావేశంలో త్రివర్ణ పతాకాన్ని మన అధికారిక జాతీయ జెండాగా ఆమోదించారు. నాటి నుంచి ఈ జెండా మన స్వేచ్ఛకు, సార్వభౌమత్వానికి గుర్తుగా నిలిచింది. మన దేశంలో ఎన్ని మతాలు, భాషలు ఉన్నా, ఈ జెండాను చూడగానే మనమంతా 'భారతీయులం' అని గర్వంగా చెప్పుకుంటాం. భిన్నత్వంలో ఏకత్వానికి ఈ జెండానే గొప్ప గుర్తు.


