హైవేపై ప్రమాదం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్జామ్

TG: హైదరాబాద్-బెంగళూరు నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా పెద్దషాపూర్ గ్రామశివారులో రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వేగంగా వచ్చిన తెలంగాణ RTC బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనతో షాద్నగర్ నుంచి శంషాబాద్ వైపు వెళ్లే మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు.



