కాలువలోకి కారు.. ఇద్దరి మృతదేహాలు లభ్యం

AP: కాలువలోకి కారు దూసుకెళ్లిన <a href="https://www.theclearcutnews.com/n/SqTyj4c">ప్రమాదం</a>లో ఇద్దరు యువకులు మృతిచెందగా.. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతంపూడి లాకుల మలుపు వద్ద తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఓగిడి గ్రామానికి చెందిన నలుగురు బీటెక్ విద్యార్థులు కోనసీమ జిల్లా మోరి వైపు కారులో వెళ్తుండగా వాహనం అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో పోతుల లక్ష్మీభాను, రాజారాం, నాగిరెడ్డి దుస్వంత, సాయిసూర్య నీటిలో గల్లంతయ్యారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది కాలువలో గాలింపు చేపట్టారు.



