← Back to news

కేపీహెచ్‌బీ వద్ద రోడ్డు ప్రమాదం

By RK· 20 Jul 2026

TG: హైదరాబాద్ నగరం KPHB పోలీస్‌స్టేషన్ పరిధిలోని హైదర్‌నగర్ వద్ద రోడ్డు దాటుతున్న నర్సింహ(60)ను వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. మృతుడు జహీరాబాద్ శిశుమందిర్ పాఠశాలలో రిటైర్డ్ ఉపాధ్యాయుడిగా గుర్తించారు.

More in News