← Back to news

రిపోర్టర్లుగా పరిచయం.. టార్గెట్ చేసి డబ్బులు డిమాండ్‌

By dk· 14 Aug 2026· కామారెడ్డి జిల్లా
రిపోర్టర్లుగా పరిచయం.. టార్గెట్ చేసి డబ్బులు డిమాండ్‌

TG: కామారెడ్డి శిరీష ఆత్మహత్య కేసులో ఇద్దరు నకిలీ రిపోర్టర్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందూరి సిద్ధాగౌడ్‌, లాండే భాస్కర్‌ ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత, ఉద్యోగ వివరాలను RTI ద్వారా సేకరించి, వాటిని ఆధారంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. శిరీషను కూడా ఉద్యోగం పోయేలా చేస్తామని బెదిరించి మానసికంగా వేధించినట్లు దర్యాప్తులో ఆధారాలు లభించాయని కామారెడ్డి DSP మధుసూదన్ వెల్లడించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 6h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.