రిపోర్టర్లుగా పరిచయం.. టార్గెట్ చేసి డబ్బులు డిమాండ్

TG: కామారెడ్డి శిరీష ఆత్మహత్య కేసులో ఇద్దరు నకిలీ రిపోర్టర్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇందూరి సిద్ధాగౌడ్, లాండే భాస్కర్ ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత, ఉద్యోగ వివరాలను RTI ద్వారా సేకరించి, వాటిని ఆధారంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. శిరీషను కూడా ఉద్యోగం పోయేలా చేస్తామని బెదిరించి మానసికంగా వేధించినట్లు దర్యాప్తులో ఆధారాలు లభించాయని కామారెడ్డి DSP మధుసూదన్ వెల్లడించారు.



