ఆధార్ వెరిఫికేషన్ అంటూ వచ్చి హత్య చేశారు

AP: పల్నాడు జిల్లా పెదకూరపాడులోని దామచర్లపాలెంలో దారుణ ఘటన జరిగింది. వృద్ధ దంపతుల ఇంట్లోకి ఆధార్ కార్డు వెరిఫికేషన్ పేరుతో ఇద్దరు వ్యక్తులు వచ్చి బాలగురవయ్యపై సుత్తితో దాడి చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన ఆయన భార్య అరుణను గొంతుకోసి చంపేసి పారిపోయారు. స్థానికులు గాయాలైన బాలగురవయ్యను హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఇన్ఫర్మేషన్ అందుకున్న పోలీసులు, డీఎస్పీ క్రిష్ణ చైతన్య ఘటన స్థలాన్ని పరిశీలించారు. స్పెషల్ టీమ్స్ను ఏర్పాటు చేసిన పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు.



